ఒంగోలు గిత్తలు అ‘ధర’హో

17 Jan, 2017 00:11 IST|Sakshi
ఒంగోలు గిత్తలు అ‘ధర’హో
- రూ.1.41 లక్షలకు విక్రయం
ఎమ్మిగనూరు రూరల్:  శ్రీ నీలకంఠేశ్వరస్వామి జాతరలో రెండు ఒంగోలు గిత్తలు రూ. 1.41 లక్షల ధర  పలికాయి. సోమవారం కోసిగి మండలం దొడ్డి బెళగల్‌ గ్రామానికి చెందిన రైతు పెద్ద తిమ్మప్ప తన ఒంగోలు గిత్తలను విక్రయించేందుకు ఎమ్మిగనూరుకు తీసుకువచ్చాడు. వీటిని తెలంగాణ రాష్ట్ర ఐజ మండలం మేడకుంద గ్రామానికి చెందిన ఈరన్న అనే రైతు.. రూ. 1.41 లక్షలకు కొనుగోలు చేశాడు. ఇంత ధర పలకటం చాలా సంతోషంగా ఉందని రైతు తిమ్మప్ప తెలిపారు.
 
మరిన్ని వార్తలు