ప్రైవేటు ఆస్పత్రులకు బకాయి పడ్డాం: కామినేని

24 Mar, 2016 16:19 IST|Sakshi

విశాఖ: ఎన్టీఆర్ వైద్య సేవలు ఆగవని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు ఆస్పత్రులకు బకాయి పడిన మాట వాస్తవమేనని మంత్రి అంగీకరించారు. వచ్చే నెల 15వ తేదీలోపు బకాయిలు చెల్లిస్తామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య విధాన పరిషత్ ద్వారా ఏప్రిల్ 11 నుంచి నిమ్స్ లో ఓపీ సేవలు అందించాలని నిర్ణయించినట్టు ఏపీ మంత్రి కామినేని వివరించారు.

>
మరిన్ని వార్తలు