గ్రహణంమొర్రి పిల్లలకు ఆపరేషన్లు

21 Jul, 2016 19:47 IST|Sakshi
ముకరంపుర: జిల్లాలో సర్వశిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) ద్వారా గుర్తించిన గ్రహణంమొర్రి గల 14 సంవత్సరాలలోపు 21 మంది విద్యార్థులకు హైదరాబాద్‌లోని ఏవీఆర్‌ హాస్పిటల్‌ సౌజన్యంతో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించారు. విద్యార్థులను జిల్లా ఐఇ కో ఆర్డినేటర్‌ ఆర్‌.ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కో ఆర్డినేటర్‌ సుభాషిణి, ఎస్‌ఎస్‌ఎ హైదరాబాద్‌ ఏఎస్‌పీడీ భాస్కర్‌రావు పరామర్శించారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉచిత రవాణా, మందుల ఖర్చులను ఎస్‌ఎస్‌ఏ తరఫున అందించారు. 
మరిన్ని వార్తలు