డిసెంబర్‌లో దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షలు

4 Nov, 2016 22:44 IST|Sakshi

ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య డిగ్రీ , పీజీ, లేటరల్‌ ఎంట్రీ పరీక్షలు డిసెంబర్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయా అధ్యయన కేంద్రాల నిర్వాహకులకు శుక్రవారం దూరవిద్య విభాగం అధికారులు ఉత్తర్వులు పంపారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ప్రభుత్వ కళాశాల, ఎయిడెడ్‌ కళాశాలకు చెందిన అధ్యాపకులను పరిశీలకులుగా నియమిస్తామని అందులో పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు విద్యార్థుల నుంచి అదనపు మొత్తాలు వసూలు చేస్తే అధ్యయన కేంద్రాలను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు