ఏపీ రాజధాని రైతుల ఆప్షన్లకు

26 May, 2016 09:00 IST|Sakshi

31 వరకు గడువు

సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతులు తమ వాటా ప్లాట్ల కోసం ఇవ్వాల్సిన ఆప్షన్ల గడువును సీఆర్‌డీఏ ఈ నెల 31వరకు పొడిగించింది. ఈ గడువు బుధవారంతో ముగిసిన నేపథ్యంలో చాలా మంది రైతులు ఆప్షన్లు ఇవ్వాల్సి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ఏపీ రాజధాని ప్రాంత రైతులు తమ వాటా భూముల్లో విల్లాలు (కాలనీలు) కావాలనుకుంటే అందుకు ప్రత్యేకంగా ఆప్షన్ల ఫారాలను ఇవ్వాలని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు.

మరిన్ని వార్తలు