మన సంప్రదాయం – మన పండుగలపై ర్యాలీ

30 Sep, 2016 00:28 IST|Sakshi
మన సంప్రదాయం – మన పండుగలపై ర్యాలీ

నార్కట్‌పల్లి :
నార్కట్‌పల్లి మండలం కేంద్రంలోని కాకతీయ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ ఆధ్వర్యంలో మన సంప్రదాయం – మన పండుగల ప్రాముఖ్యత తెలుపుతూ గురువారం ర్యాలీ నిర్వహించారు. హిందూవులకు బోనాలు, బతుకమ్మ పండుగలు,  ముస్లింలకు పీర్లు,  క్రైస్తవులకు సిల్వలను విద్యార్థులచే తయారు చేసి స్థానిక రహదారులపై ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ పుల్లంల పద్మ ముత్తయ్య, సర్పంచ్‌ పుల్లంల అచ్చాలు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రహీంఖాన్, మాజీ ఎంపీపీ బాజ యాదయ్య, సట్టు సట్టయ్య, ప్రజ్ఞాపురం సైదులు, పాఠశాల ప్రిన్సిపాల్‌ నడింపల్లి వెంకటేశ్వర్లు, రాపర్తి మధు, జినుకల కార్తీక్‌ పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు