'ఆ ఘనత చంద్రబాబుదే'

27 Feb, 2016 12:54 IST|Sakshi

అనంతపురం : సీఎం చంద్రబాబుపై ఏపీ సీపీఎం కార్యదర్శి పి. మధు శనివారం అనంతపురంలో మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రాజకీయాలను వ్యాపారమయం చేసిన ఘనత చంద్రబాబుదే అని విమర్శించారు. ఎన్నికల హామీలను పక్కన పెట్టి ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తున్నారని చంద్రబాబుపై మధు మండిపడ్డారు.   
 

మరిన్ని వార్తలు