వేంసూరు(ఖమ్మం): కల్తీ నెయ్యి తయారు చేస్తున్న కంపెనీకి చెందిన ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మండలంలోని కుంచుపట్ల గ్రామంలోని ఓ ఇంట్లో కృష్ణా జిల్లా నున్నకు చెందిన ఓ ప్రముఖ కంపెనీ పేరుతో కల్తీ నెయ్యి తయారు చేస్తుండగా పోలీసులు దాడి చేశారు. అయితే పోలీసుల తనిఖీలలో ఓ ప్యాకింగ్ బాయ్ పోలీసులకు చిక్కాడు. అతడిని పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్నట్లు సమాచారం.