ఆర్‌యూను సందర్శించిన పద్మావతి వర్సిటీ వీసీ

10 May, 2017 23:15 IST|Sakshi
కర్నూలు (ఆర్‌యూ):  పద్మావతి మహిళా యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ వీరమాచినేని దుర్గా భవాని బుధవారం రాయలసీమ యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర​‍్భంగా ఆర్‌యూ అభివృద్ధి పనులను, వర్సిటీ భవనాలను పరిశీలించారు. వర్సిటీలో విద్యార్థులకు ఉచిత వైఫై సౌకర్యం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్‌యూ మాదిరిగా తమ వర్సిటీలో ప్రభుత్వ సంస్థల సహకారంతో  భవన నిర్మాణాలు చేపడతామన్నారు.  ఈ కార్యక్రమంలో వర్సిటి రిజిస్ట్రార్‌ అమర్‌నాథ్, సిబ్బంది పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు