దక్షిణాఫ్రికాలో పాలమూరువాసి మృతి

28 Dec, 2016 03:37 IST|Sakshi
దక్షిణాఫ్రికాలో పాలమూరువాసి మృతి

తిమ్మాజీపేట: నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామానికి చెందిన చర్లకోల శశిధర్‌ రెడ్డి సోమవారం దక్షిణాఫ్రికాలో జరిగిన రోడ్డు ప్రమా దంలో మృతి చెందాడు. టాంజానియా రాష్ట్రంలోని ఓ కంపెనీలో సీనియర్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న శశిధర్‌రెడ్డి.. క్రిస్మస్‌ సెలవులు రావడంతో భార్య అశ్వినితో కలసి ఓ ప్రైవేటు క్యాబ్‌లో విహార యాత్రకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో క్యాబ్‌ డ్రైవర్‌తోపాటు శశిధర్‌రెడ్డి మరణించారు. అతని భార్య అశ్వనికి సైతం తీవ్ర గాయాలైనట్లు తెలి సింది. ఆవంచ గ్రామానికి చెందిన చర్లకోల రాంరెడ్డి, వనజ దంపతులు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. శశిధర్‌రెడ్డి మృతదేహం బుధవారం హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉందని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు