పర్వతగిరి హైస్కూల్‌ పీఈటీ పై వేటు

29 Jul, 2016 22:24 IST|Sakshi
విద్యారణ్యపురి : మహబూబాబాద్‌ మండలం పర్వతగిరి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ పీఈటీ ప్రేమ్‌కుమార్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు డీఈవో రాజీవ్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ స్కూల్‌లో హెచ్‌ఎం సుభాష్, పీఈటీ ప్రేమ్‌కుమార్‌ నడు మ  కొంత కాలంగా  వివాదం నడుస్తుండగా డిప్యూటీ డీఈఓతో విచారణ జరిపించారు. ఈ మేరకు పీఈటీ ప్రేమ్‌కుమార్‌ను సస్పెన్షన్‌ చేసినట్లు డీఈవో తెలిపారు. ఇదిలా ఉండగా హెచ్‌ఎం సుభాష్‌ను గురువారం సస్పెం డ్‌ చేసిన విషయం విదితమే. 
మరిన్ని వార్తలు