బస్సు బోల్తా: ముగ్గురి మృతి

20 Nov, 2016 07:18 IST|Sakshi
బస్సు బోల్తా: ముగ్గురి మృతి

విజయనగరం: విజయనగరం జిల్లాలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని రామభద్రాపురం వద్ద ఒడిషాకు చెందిన ఓ బస్సు బోల్తాపడ్డ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు మృతిచెందగా, మరో 10 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతులలో మహిళలు, ఓ చిన్నారి ఉన్నట్లు సమాచారం.

డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం, నిద్రమత్తులో ఉండటం వల్లే మలుపు తిరిగే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని ప్రయాణికులు చెబుతున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు