పశుసంవర్ధకశాఖను ప్రగతి పథంలో నడిపిస్తా

20 Sep, 2016 01:09 IST|Sakshi
  • lనూతన జేడీడాక్టర్‌ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌
  • అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లాకు కేటాయించిన పథకాలు సక్రమంగా అమలు చేసి, పశుసంవర్ధకశాఖను ప్రగతి పథంలో నడిపించడానికి శాయశక్తులా కృషి చేస్తానని పశుసంవర్ధకశాఖ కొత్త జాయింట్‌ డైరెక్టర్‌ (జేడీ) డాక్టర్‌ వి.రవీంద్రనాథఠాగూర్‌ అన్నారు. ప్రకాశం జిల్లాలో డీడీగా పనిచేస్తూ పదోన్నతిపై జిల్లాకు జేడీగా బదిలీపై వచ్చిన ఆయన సోమవారం స్థానిక పశుశాఖ కార్యాలయంలో ఇన్‌చార్జ్‌ జేడీ డాక్టర్‌ కె.జయకుమార్‌ నుంచి బాధ్యతలు స్వీకరించారు. పలువురు ఏడీలు, డాక్టర్లు, కార్యాలయ సిబ్బంది  జేడీకి పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.
     

మరిన్ని వార్తలు