'అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి'

29 Jan, 2016 14:04 IST|Sakshi

గుంటూరు: రాజధాని ప్రాంత రైతులతో సక్రమంగా వ్యవహరించడం లేదని సీఆర్డీఏ అధికారులపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.

రైతులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమాచారాన్ని తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. నేతల వల్లనే సమస్యలు వస్తున్నాయని చెప్పడంతో అధికారులపై ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వారం రోజుల్లో రైతుల సమస్యలను పరిష్కరించాని ఆదేశించారు.
 

మరిన్ని వార్తలు