యర్రా శ్రీదేవికి ఘన నివాళులు

13 May, 2016 10:29 IST|Sakshi

ఒంగోలు : ప్రముఖ టాలీవుడ్ నటుడు గిరిబాబు సతీమణి యర్రా శ్రీదేవికి శుక్రవారం పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. జిల్లాలోని కొరిసపాడు మండలం రావినూతలలో గిరిబాబు నివాసంలో యర్రా శ్రీదేవి మృతదేహాన్ని జెడ్పీ ఛైర్మన్ ఈదర హరిబాబుతోపాటు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సందర్శించి... ఘనంగా నివాళులర్పించారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న గిరిబాబు సతీమణి యర్రా శ్రీదేవి గురువారం మరణించిన సంగతి తెలిసిందే. ఆమె అంత్యక్రియలు శుక్రవారం రావినూతలలో జరపనున్నారు.

మరిన్ని వార్తలు