200 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

12 Aug, 2016 08:08 IST|Sakshi

ఖమ్మం : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెద్దగోపవరం, బనిగండ్లపాడు గ్రామాల్లో విజిలెన్స్ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యం దాదాపు 200 క్వింటాళ్లు ఉంటుందని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు