ప్రతి కుటుంబంలో శాంతి వికసించాలి

20 Dec, 2016 21:26 IST|Sakshi
ప్రతి కుటుంబంలో శాంతి వికసించాలి
– బిషప్‌ పూల ఆంథోని 
– లూర్ధుమాత కథిడ్రల్‌ ఆలయంలో సెమీ క్రిస్మస్‌ 
 
కర్నూలు సీక్యాంప్‌: క్రిస్మస్‌ పండుగ ప్రతీ కుటుంబంలో శాంతి వికసించాలని కర్నూలు, అనంతపురం డయాసిస్‌ బిషప్‌ పూల ఆంథోని ఆకాంక్షించారు.  మంగళవారం నగరంలోని లూర్ధుమాత కథిడ్రల్‌ ఆలయంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పూల ఆంథోని మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఇతరుల పట్ల ప్రేమ, దయ, జాలి కలిగిఉండాలన్నారు. కార్యక్రమంలో లూర్థు మాత ఆలయ సిస్టర్స్, ఫాదర్స్ పాల్గొన్నారు.
>
మరిన్ని వార్తలు