21న పెద్దారెడ్డి సంస్మరణ సభ

18 Aug, 2016 00:03 IST|Sakshi

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: సామాజిక విప్లవకారుడైన పెద్దారెడ్డి సంస్మరణ సభ ఈ నెల 21న కొత్తచెరువులో నిర్వహిస్తున్నట్లు పోతుల సురేష్‌ తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూలై 1న పెద్దారెడ్డి మృతి చెందారని, ఆయన జ్ఞాపకార్థంగా సంస్మరణ సభను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో విజయభాస్కర్‌ రెడ్డి, కార్పొరేటర్‌ బంగి. సుదర్శన్, రామాంజినేయులు, అల్లాబకష్, లింగమయ్య పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు