చంద్రబాబు నిప్పుయితే...

4 Sep, 2016 09:37 IST|Sakshi

చిత్తూరు: కుప్పానికి నీళ్లు అందించటం ఆనందమే... కానీ పరిసర రైతులను మరిచిపోవద్దు అని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. ఆదివారం చిత్తూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నిప్పుయితే హైకోర్టుకు వెళ్లి స్టే ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు. ఏసీబీ కేసును ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. పంటలు ఎండిపోయిన తర్వాత రెయిన్ గన్లు ఎవరి కోసమని చంద్రబాబును పెద్దిరెడ్డి సూటిగా ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు