నెల్లూరు(స్టోన్హౌస్పేట) : రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి పి.నారాయణ ఆదివారం పెన్నాబ్యారేజీ పనులను పరిశీలించారు. అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించిన మేరకు వచ్చే మార్చి నెలలోగా సంగం, పెన్నా బ్యారేజీల పనులను పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట అధికారపార్టీ నాయకులు, ఇరిగేషన్ ఎస్ఈ కోటేశ్వరరావు, పలువురు అధికారులు ఉన్నారు.