హోదా కోసం సైకిల్‌ యాత్ర

19 Feb, 2018 05:45 IST|Sakshi

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తిరుపతిలో ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం మెంతిపూడి గ్రామానికి చెందిన కె.వెంకట్‌ తిరుపతి నుంచి న్యూఢిల్లీకి సైకిల్‌ యాత్ర ప్రారంభించాడు. ప్రజా సంకల్ప యాత్రలో వలేటివారిపాలెం మండలం కాకుటూరు వద్ద వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తన యాత్ర గురించి వివరించాడు. మార్చి 15వ తేదీలోగా ఢిల్లీ చేరుకుంటానని చెప్పాడు. ఇతను 2016లోనూ ప్రత్యేక హోదా కోరుతూ సైకిల్‌పై న్యూఢిల్లీ వెళ్లడం విశేషం.

>
మరిన్ని వార్తలు