చీరాల అర్బన్: ‘నా తమ్ముడు లింగాబత్తిన మల్లికార్జునకు ఇద్దరు కవలపిల్లలు పుట్టారు. వైఎస్సార్పై ఉన్న అభిమానంతో ఇద్దరి పిల్లలకు రాజశేఖర్, జగన్ అని పేర్లు పెట్టాడు. అయితే రెండు సంవత్సరాల క్రితం తన తమ్ముడు చనిపోయాడు. అప్పటి నుండి నా మరదలు అనితకు వితంతు పింఛన్ ఇవ్వడం లేదు’ అంటూ పి.మాలతి.. వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరించింది. పింఛన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నా అధికార పార్టీ నాయకులు అడ్డుపడుతున్నారని వాపోయింది.