వాగులో పడి వ్యక్తి గల్లంతు

11 Sep, 2016 12:28 IST|Sakshi

ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ముల్కలపల్లి మండలంలోని ముత్యాలంపాడులో ఆదివారం చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా మండల పరిధిలో భారీ వర్షం కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వదర ప్రవాహ చేరికతో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో పాలెంవాగు గ్రామానికి చెందిన సతీష్ గల్లంతయ్యాడు. కాగా.. ఇదే మండలంలోని చందంపేటలో పిడుగుపాటుకు ఐదు మేకలు మృతిచెందాయి.
 

>
మరిన్ని వార్తలు