పింగిళి విద్యార్థినుల 2కే రన్‌

29 Jul, 2016 00:22 IST|Sakshi
రన్‌లో పాల్గొన్న పింగిళి కాలేజీ విద్యార్థినులు
హన్మకొండ : హన్మకొండ వడ్డెపల్లిలోని పింగిళి ప్రభుత్వ మహిళా కాలేజీ స్వర్ణోత్సవాను పురస్కరించుకుని 2కే రన్‌ నిర్వహించారు. హన్మకొండ సుబేదారిలోని తెలంగాణ అమరుల కీర్తి స్తూపం నుంచి వడ్డేపల్లిలోని కళాశాల వరకు సాగిన ఈ రన్‌ను గురువారం ఉదయం ఏడు గంటలకు కాలేజీ ప్రిన్సిపాల్‌ జి.ఇందిర, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ బెహారా ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో రన్‌లో విజేతలైన విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎస్‌బీహెచ్‌ ఏజీఎంలు వెంకటేశ్వర్‌రావు, సత్యనారాయణ, మేనేజర్‌ సంతాజీ, కాలేజీ ఫిజికల్‌ డైరక్టర్‌ అశోక్‌రెడ్డి, అధ్యాపకులు ఎల్‌.వేణు, వేణుగోపాలం, వాసిరెడ్డి కృష్ణారావు, రేణుక, సుజాత, సమత, రాణా, ఫిజికల్‌ డైరెక్టర్లు అనూస్, శ్రీనివాస్, రాంరెడ్డి, జ్యోత్స్న, మధుసూదన్‌ పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు