బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహనకు పింక్‌రన్‌

12 Nov, 2016 20:02 IST|Sakshi
బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహనకు పింక్‌రన్‌

విజయవాడ (లబ్బీపేట) : బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై మహిళలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌కు చెందిన యువతి నీలిమ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే విజయవాడ నుంచి విశాఖపట్నం వరకూ షూ, చెప్పులు లేకుండా పింక్‌రన్‌ను ప్రారంభించింది. బందర్‌ రోడ్డులోని పీవీపీ మాల్‌ వద్ద శనివారం వేకువజామున 4 గంటలకు ఈ పరుగును ప్రారంభించిన ఆమె వారం రోజుల్లో విశాఖ చేరుకోనుంది. అక్కడ పింక్‌రన్‌–2016 పేరులో ఈనెల 20న నిర్వహించనున్న కార్యక్రమంలో ఆమె పాల్గొంటుంది. ఈ సందర్భంగా నీలిమ మాట్లాడుతూ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే నివారించడం సాధ్యమని, సరైన అవగాహన లేకపోవడం వల్లే మహిళలు మృత్యువాత పడుతున్నారన్నారు. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే షూ, చెప్పులు లేకుండా రన్‌ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు.








 

మరిన్ని వార్తలు