విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ

6 Sep, 2016 22:25 IST|Sakshi
విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ
వట్టిఖమ్మంసహాడ్‌(చివ్వెంల) : విద్యార్థులు, క్రమ శిక్షణ, పట్టుదలతో చదవాలని వాసవీక్లబ్‌ సూర్యాపేట అధ్యక్షుడు పి.వి. లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం వట్టిఖమ్మంపహాడ్‌ గ్రామానికి చెందిన దాత బిక్కుమల్ల అరుణ్‌కుమార్‌–మణిల కుమారుడు అభిజిత్‌ కుమారుడు భారత నేవీలో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా ఉద్యోగం పొందిన సందర్భంగా 150 మంది విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో క్లబ్‌ సభ్యులు బ్రహ్మరావు, శ్యాంప్రసాద్, రాధాక్రిష్ణ, హెచ్‌ఎం యాదగిరి, ఉపాధ్యాయులు వెంకట్‌రెడ్డి, సూర్యానారాయణ, శ్యామల, విజయ కుమారి, క్రిష్ణ, వెంకటేశ్వర్లు, చారి, లక్ష్మణ్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు