సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఫ్లాట్‌ఫాం టికెట్‌ ధర పెంపు

6 Jan, 2017 00:11 IST|Sakshi
సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఫ్లాట్‌ఫాం టికెట్‌ ధర పెంపు

రూ.10 నుంచి రూ.20కి పెంచుతూ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఫ్లాట్‌ఫాం టికెట్‌ చార్జీలు పెరగనున్నాయి. సాధారణ రోజుల్లో ఉండే రూ.10 టికెట్‌ను రూ.20కి పెంచారు. సంక్రాంతి, శబరిమలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 10 నుంచి 16 వరకు తాత్కాలికంగా ఫ్లాట్‌ఫాం టికెట్‌ చార్జీలను పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. స్టేషన్‌పై ఒత్తిడిని తగ్గించేందుకు, ప్రయాణికులు కాని వాళ్ల ప్రవేశాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు