కరాటేలో సత్తాచాటిన క్రీడాకారులు

12 Dec, 2016 14:31 IST|Sakshi
కరాటేలో సత్తాచాటిన క్రీడాకారులు
నిడదవోలు :ఈ నెల 6న రాజస్థాన్‌లోని జైపూర్‌లో నిర్వహించిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో  నిడదవోలుకు  చెందిన ఎస్‌కే సలీం, ఎం.జావేద్‌ రెహమాన్‌ ఖురేషి రాష్ట్రం తరఫున పాల్గొని వెండి పతకాలు సా«ధించారు. ఈ విషయాన్ని ఆంధ్రరాష్ట్ర జట్టు మేనేజర్‌ ఎంవీఆర్‌ రాజు శుక్రవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ గుజోరియో కరాటే అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు సత్తి వేణుమాధవరెడ్డి, గౌరవాధ్యక్షుడు  బండి రాంబాబు, రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు కేదారిశెట్టి రవికుమార్‌ క్రీడాకారులను అభినందించారు.  
మరిన్ని వార్తలు