3న తిరుమలకు రానున్న ప్రధాని మోదీ

2 Jan, 2017 04:26 IST|Sakshi
3న తిరుమలకు రానున్న ప్రధాని మోదీ

తిరుమల: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 3వ తేదీన తిరుమలకు రానున్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఢిల్లీకి తిరిగివెళ్తారు. మోదీ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. మంగళవారం తిరుమలలో కోయిళ్‌ ఆల్వార్‌ తిరుమంజనం ఉండటంతో ఆ రోజు వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేశారు.

ఆదివారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు 7 కంపార్ట్‌మెంట్లలో ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటలు, కాలిబాట భక్తులకు 3 గంటల సమయం పట్టింది.

మరిన్ని వార్తలు