బాబుకు పోల‘వరం’

21 Sep, 2016 23:22 IST|Sakshi
ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌తిప్పారెడ్డి
– ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌తిప్పారెడ్డి
మదనపల్లె రూరల్‌: కోట్ల ప్రజాధనాన్ని అప్పనంగా దోచుకునేయచ్చనే దురాశతోనే పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించాలని చంద్రబాబు కోరారని ఎమ్మెల్యే దేశాయ్‌ తిప్పారెడ్డి ఆరోపించారు. ఆయన బుధవారం స్థానిక వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాపై గతంలో ఒక మాట, ఇప్పుడు ఒక మాట మాట్లాడడం దారుణమనానరు. ప్రత్యేక హోదా ఐదేళ్లు ఇస్తామని కాంగ్రెస్‌ ప్రకటిస్తే పదేళ్లు ఇవ్వాల్సిందేనని నోరు పారేసుకుని నానాయాగీ చేసిన వెంకయ్యనాయుడు ఇప్పుడు నోరు జారాననడం సబబు కాదన్నారు. ప్రత్యేక హోదా కాకుండా ప్యాకేజీతో సంతృప్తి పడదామంటున్న టీడీపీ నాయకులకు వాటి మధ్య ఉన్న తేడా తెలుసా అంటా అని ప్రశ్నించారు. ప్రతి విషయంలోనూ రాజీ పడడం తప్ప పోరాటం చేసే సత్తా చంద్రబాబుకు లేదని దుయ్యబట్టారు. హోదా అనేది దేశంలో నిమ్నకులాలకు కల్పిస్తున్న రిజర్వేషన్‌ లాంటిదన్నారు. తద్వారా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. రెయిన్‌గన్స్‌ పేరుతో రూ.270 కోట్లు వృథా చేశారని, ఆ నిధులను వెనుకబడిన మండలాలకు కేటాయించి ఉంటే కనీసం అభివృద్ధి పనులన్నా జరిగేవన్నారు. వేరుశనగ పంట ఎండిపోయి రైతులు నష్ట పరిహారం కోసం ధర్నాలు చేసే స్థితికి తీసుకువచ్చారని దుయ్యబట్టారు. 
మరిన్ని వార్తలు