'ఎర్ర' స్మగ్లింగ్లో పోలీసుల పాత్ర: డీజీపీ

25 Sep, 2015 15:00 IST|Sakshi
'ఎర్ర' స్మగ్లింగ్లో పోలీసుల పాత్ర: డీజీపీ

కర్నూలు: త్వరలో కానిస్టేబుళ్ల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వెంకటరాముడు తెలిపారు. శుక్రవారం ఆయన కర్నూలు నగరంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో బ్రౌన్ షుగర్పై పూర్తి విచారణ జరుపుతామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్లో పోలీసుల పాత్ర కూడా ఉందని ఆయన అన్నారు. నిందితులతో చేతులు కలిపిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని డీజీపీ రాముడు ఈ సందర్భంగా తెలియజేశారు.

మరిన్ని వార్తలు