భూపాలపల్లిలో పెద్దనోట్ల కలకలం

9 Dec, 2016 18:56 IST|Sakshi
భూపాలపల్లి: జిల్లా కేంద్రంలో పెద్ద మొత్తంలో కొత్త 2 వేల రూపాయల నోట్లు కలిగి ఉన్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు వ్యక్తుల వద్ద మొత్తం కలిపి రూ.19.62 లక్షల విలువైన కొత్త నోట్లను గుర్తించినట్లు సమాచారం. వారిని అదపులోకి తీసుకున్న పోలీసులు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయంపై ఆరా తీస్తున్నారు. కాగా, నలుగురు వ్యక్తులు కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. 
 
మరిన్ని వార్తలు