పోలీసుల ఆధ్వర్యంలో హరితహారం

16 Jul, 2016 23:27 IST|Sakshi
పోలీసుల ఆధ్వర్యంలో హరితహారం

ఊట్కూర్‌ : ఊట్కూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో శనివారం పోలీసుల ఆధ్వర్యంలో బుద్ధిమాంద్యం విద్యార్థులచే హరితహారం కార్యక్రమం నిర్వహించారు. పీఎస్‌ఐ కేతావత్‌ రవి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని కోరారు. బుద్దిమాంద్యం విద్యార్థులు హరితహారంలో పాల్గొనడం స్ఫూర్తినిస్తుందని అన్నారు. అనంతరం విద్యార్థులకు పాలు, బ్రెడ్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది హన్మంతు, వెంకట్రాములు, వికలాంగుల సంఘం నాయకులు నర్సింగమ్మ, రాములమ్మ, వినోద్‌కుమార్, కేశవులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు