అమ్మో.. ముట్టడా?

6 Sep, 2016 22:59 IST|Sakshi
అమ్మో.. ముట్టడా?
 
విజయవాడ లీగల్‌ : 
కోర్టు వాయిదాకు వచ్చిన 50 మంది  కక్షిదారులను సీఎం క్యాంపు ఆఫీసు వద్ద ఉన్న  పోలీసులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... జి.కొండూరు మండలానికి చెందిన కొంతమంది సీపీఐ నాయకులు, కార్యకర్తలు గతంలో భూ పోరాటం కేసులో నిందితులుగా ఉన్నారు. కోర్టు వాయిదా నిమిత్తం మంగళవారం మినీ వ్యానులో పార్టీ జెండాలు కట్టుకుని నాలుగో అదనపు చీఫ్‌ మెట్రో పాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టుకు వచ్చారు. అక్కడే ఉన్న క్యాంపు ఆఫీసు పోలీసులు వారిని అడ్డుకున్నారు. సీఎం కార్యాలయాన్ని ముట్టడించడానికి వచ్చారేమోనని నిర్బంధించి పై అధికారులకు సమాచారం అందజేశారు. ఏదో భారీ ఆందోళన జరగబోతోందేమో అన్నట్లుగా అంతటా అప్రమత్తమయ్యారు. క్యాంపు ఆఫీసుకు వచ్చే రూట్లలో చెకింగ్‌ ముమ్మరం చేయడంతో అందరూ ఏం జరుగుతోందోనని ఉత్కంఠకు గురయ్యారు. వారు ఆందోళనకారులు కాదు, కోర్టు కేసు వాయిదాకు వచ్చారని నిందితుల తరుపు న్యాయవాది వచ్చి చెప్పడంతో పోలీసులు వదిలేశారు. 
 
 
మరిన్ని వార్తలు