'నాకు రాజకీయ భిక్ష పెట్టింది ఆయనే'

1 Mar, 2016 13:29 IST|Sakshi
'నాకు రాజకీయ భిక్ష పెట్టింది ఆయనే'

గుంటూరు: 'నాకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని' నరసరావుపేట ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నరసరావుపేటలో మాట్లాడుతూ...జీవితాంతం వైఎస్ జగన్తో ఉంటానని చెప్పారు.

బడ్జెట్లో ఏపీకి కేంద్రం మొండిచేయి చూపించిందని ఆరోపించారు. కేంద్రప్రభుత్వం నుంచి నిధులు తేవడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. పోలవరానికి రూ.100 కోట్లు కేటాయిస్తే ఎప్పటికీ నిర్మాణం పూర్తవుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు