కర్నూలు సిటీ: పాలిటెక్నిక్ కాలేజీల ప్రవేశాల కోసం మంగళవారం కౌన్సెలింగ్ ప్రక్రియను కర్నూలులో జి.పుల్లారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నికల్ కాలేజీ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ చక్రవర్తి ప్రారంభించారు. మొదటి రోజు 1నుంచి 10 వేల ర్యాంకు వరకు నిర్వహించిన కౌన్సెలింగ్ నిర్వహించారు. గత నెల 28న పాలీసెట్–2017 ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ నెల 10న ఫలితాలు విడుదలయ్యాయి. వచ్చే నెల 6వరకు కౌన్సెలింగ్ ఉంటుంది. 2వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడం, 8న ఆప్షన్ల మార్చునకు అవకాశం ఉంటుంది. 10న సీట్లు కేటాయించనున్నట్లు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ చక్రవర్తి తెలిపారు.