పాలిటెక్నిక్‌ విద్యార్థి ఆత్మహత్య

26 Sep, 2016 00:11 IST|Sakshi

పామిడి : పట్టణంలోని ఎద్దులపల్లి రోడ్డు సమీపంలో రామాంజనేయులు కుమారుడు పవన్‌కుమార్‌(16) రైలు కిందపడి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు.  పవన్‌కుమార్‌ అనంతపురం పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థి. ఇటీవల తరచూ తీవ్ర తలనొప్పితో బాధపడేవాడు. తలనొప్పి తీవ్రకావడంతో భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు బాధిత తండ్రి ఫిర్యాదు మేరకు గుత్తి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు