అంతర్జాతీయ త్రోబాల్‌ క్లినిక్‌కు ప్రభుకుమార్‌

20 Oct, 2016 23:38 IST|Sakshi

హిందూపురం టౌన్‌ : త్రోబాల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఇంటర్‌నేషనల్‌ త్రోబాల్‌ అసోసియేషన్స్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ త్రోబాల్‌ క్లినిక్‌కు జనరల్‌ సెక్రటరీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ త్రోబాల్‌ అసోసియేషన్‌ టెక్నికల్‌ అఫీషియల్‌గా తనను నియమిస్తూ త్రోబాల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా నుండి ఉత్తర్వులు అందాయని త్రోబాల్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ ప్రభుకుమార్‌  తెలిపారు.

ఈనెల 21 నుంచి 24 వరకు బ్యాంకాక్, థాయ్‌ల్యాండ్‌లో త్రోబాల్‌ క్లినిక్‌ను నిర్వహిస్తున్నారన్నారు. ఇందులో దాదాపు 30 దేశాలు పాల్గొంటాయని తెలిపారు. త్రోబాల్‌ క్లినిక్‌కు ప్రభుకుమార్‌ ఎంపిక కావడంతో అనంతపురం జిల్లాకే కాకుండా హిందూపురానికి కూడా గర్వకారణమని ఏపీ త్రోబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు విద్యాసాగర్, ఆనంద్‌నాయక్, పీడీ లోక్‌నాథ్‌ అన్నారు.

మరిన్ని వార్తలు