ఆర్టీసీ బస్సు ఢీకొని నిండు గర్భిణి మృతి

2 Feb, 2017 21:12 IST|Sakshi

రాజంపేట(వైఎ‍స్సార్‌ జిల్లా):
రాజంపేట మండలం పోలమందారంలో విషాదం చోటుచేసుకుంది. బస్సు కోసం వేచి ఉన్న ఇద్దరు మహిళలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ నిండు గర్భిణీ తాలూరి ఎల్లమ్మ(21)తో పాటు మరో మహిళ గోగులదేవి(25) అక్కడికక్కడే మృతిచెందారు. ఎల్లమ్మది పుల్లంపేట మండలం సీవీజీపల్లి అ‍గ్రహారం కాగా..గోగులదేవీ(25)ది పోలమందారం.

ఆర్టీసీ బస్సు రాజంపేట నుంచి చిట్వేలు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు