కోవూరు : మండలంలోని జమ్మిపాళెం ఇసుకరీచ్లో ఇరువర్గాలకు చెందిన కూలీల మధ్య వివాదం చోటుచేసుకుని ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వివరాలు.. రీచ్లో గత కొంతకాలంగా జమ్మిపాళెంకు చెందిన కూలీలు మాత్రమే ఇసుకను లోడ్ చేస్తున్నారు. సమీప గ్రామాలకు చెందిన వారు మంగళవారం రీచ్ వద్దకు చేరుకుని తమకు కూడా రీచ్లో పనికల్పించాలని కోరారు. దీంతో ఇరువర్గాలకు చెందిన కూలీల మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న కోవూరు ఎస్సై వెంకట్రావ్ సంఘటనా స్థలానికి చేరుకుని వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించారు.