మా సమస్యలు పరిష్కరించండి

7 Nov, 2016 23:44 IST|Sakshi
మా సమస్యలు పరిష్కరించండి
భానుగుడి (కాకినాడ) : కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన తమ సమస్యలను పరిష్కరించాలని రాజీవ్‌ విద్యామిషన్‌  పీవో మేకా శేషగిరిని ఆర్వీఎం ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ ఆసోసియేషన్‌  సభ్యులు కోరారు. సోమవారం పీవోను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. 2012 నుంచి పనిచేస్తున్న ఆర్వీఎం ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ , ఫిజికల్, వర్క్‌ ఎడ్యుకేషన్‌  కాంట్రాక్టు ఉపాధ్యాయులను పాఠశాలల్లో 100 మంది కంటే తక్కువ విద్యార్థులున్న చోట తీసేశారని, జిల్లాలో ప్రస్తుతం ఏర్పడిన ఖాళీలను వారితో భర్తీ చేయాలని కోరారు. ఈ విద్యాసంవత్సరంలో పక్క జిల్లాల్లో జూ¯ŒS 16నుంచి వేతనాలిస్తే మన జిల్లాలో జులై 4నుంచి వేతనాలిచ్చారని, ఇక్కడా అదే తరహా నిబంధనను అమలు చేయాలని కోరారు. పాఠశాలల్లో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు. పీవోను కలిసినవారిలో ఏఎంవో చామంతి నాగేశ్వరరావు, ఆ సంఘం జిల్లా అ««దl్యక్షుడు ఎన్‌. రాజేంద్రప్రసాద్, సీహెచ్‌ఎన్‌.రవి,రాధాకృష్ణ, ప్రసన్నకుమార్‌ అసిస్టెంట్‌ ఏఎంవో ఎన్‌ .రాజేంద్రప్రసాద్‌ ఉన్నారు.
మరిన్ని వార్తలు