12న అమలాపురంలో మహాధర్నా

3 Sep, 2016 23:34 IST|Sakshi
12న అమలాపురంలో మహాధర్నా
 
విజయవాడ (గాంధీనగర్‌) : 
దళితులపై దాడులకు నిరసనగా ఈనెల 12న ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో అమలాపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించనున్నామని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక కార్యాలయంలో చలో అమలాపురం వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయన్నారు. ఆవులను వధిస్తున్నారన్న నెపంతో గుజరాత్‌లో మతోన్మాద దాడి మరువకుముందే అమలాపురంలో దాడులు జరగడం దారుణమన్నారు. అమలాపురంలో జరిగే మహాధర్నాలో ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్‌ నాయకులు పాల్వాయి దాస్, చుక్కా నరేష్, మేకల కోటేశ్వరరావు, రాజు, రాజేష్‌  పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు