స్టడీ మెటీరియల్‌ కోసం ఆందోళన

31 Dec, 2016 22:18 IST|Sakshi
స్టడీ మెటీరియల్‌ కోసం ఆందోళన

ఎస్కేయూ : వర్సిటీ దూరవిద్య  విద్యార్థులకు స్టడీమెటీరియల్‌ను అందించడంలో జాప్యంపై శనివారం విద్యార్థి నాయకులు దూరవిద్య విభాగం స్టడీమెటీరియల్‌ కేంద్రం వద్ద ధర్నా చేసి, అధికారులను ఘెరావ్‌ చేశారు. మెటీరియల్‌ అందించడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా స్టడీ మెటీరియల్‌ అందిజేయాలని కోరారు.   ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి జాన్సన్‌బాబు, వీర, క్రాంతి, లింగ, దేవరాజు, నగేష్, శివ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు