బాధితుడికి చెక్కు అందించిన మంత్రి

5 Aug, 2016 18:22 IST|Sakshi
బాన్సువాడ టౌన్‌ : మండలంలోని సంగోజిపేట్‌ గ్రామానికి చెందిన మాగి పోశవ్వ గతేడాది పాముకాటుతో మృతి చెందింది. దీంతో ఆపద్బంధు కింద మృతురాలి భర్త నారాయణకు రూ. 50 వేల చెక్కు మంజూరైంది. దీన్ని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ గోపి, బోర్లం సహకార సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, గ్రామ సర్పంచ్‌ సాయిలు, టీఆర్‌ఎస్‌ నాయకులు సాయిరాం, మారుతి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు