సమస్యల పరిష్కారంలో పీఆర్టీయూ ముందంజ

3 Aug, 2016 21:53 IST|Sakshi
సమస్యల పరిష్కారంలో పీఆర్టీయూ ముందంజ

ఆలేరు: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో పీఆర్టీయూ ముందంజలో ఉందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ అన్నారు. ఆలేరులోని బీసీ కాలనీలో నూతనంగా నిర్మించిన టీఎన్‌ పీఆర్టీయూ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మండలంలోని శారాజీపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు పంగ జనార్ధన్‌రెడ్డి ఉద్యోగ విరమణ అభినందన సభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాలని, త్వరలో పండిట్, పీఇటీల పోస్టులను ఆప్‌గ్రేడ్‌ చేసే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాసగల్ల అనసూర్య, జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, ఎంపీడీఓ చిల్కూరి శ్రీనివాస్, ఎంఈఓ లక్ష్మినారాయణ, సర్పంచ్‌ బెంజారం రజని, పీఆర్టీయూ నాయకులు నరహరి లక్షా్మరెడ్డి, సుంకరి భిక్షంగౌడ్, కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, హెచ్‌ఎం ఇందిరాదేవి, ఉపాధ్యాయులు గడసంతల మధుసూదన్, పరిగెల రాములు, మాదాని జోసెఫ్, మంద సోమరాజు, తునికి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు