స్వచ్ఛతలో మున్సిపాలిటీ ఆదర్శం

26 Jan, 2017 22:54 IST|Sakshi
స్వచ్ఛతలో మున్సిపాలిటీ ఆదర్శం

చైర్‌పర్సన్  పావని
సిరిసిల్ల :  స్వచ్ఛతలో సిరిసిల్ల మున్సిపాలిటీ రాష్ట్రానికే ఆదర్శంగా ఉంటుందని చైర్‌పర్సన్  సామల పావని అన్నారు. స్థానిక విద్యానగర్‌లో కమిషనర్‌ సుమన్ రావుతో కలిసి సెప్టిక్‌ట్యాంకులను పరిశీలించారు. పట్టణంలోని ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉందని, మురుగుకాలువకు పైపులను తొలగించి సెప్టిక్‌ట్యాంకులను నిర్మించేందుకు నెలరోజులుగా శ్రమించామని పేర్కొన్నారు. పందులను తొలగించేక్రమంలో మున్సిపల్‌ సిబ్బంది, కౌన్సిలర్ల సహకారంతో లక్ష్యాన్ని చేరామన్నారు. ఆమె వెంట కౌన్సిలర్‌ వెల్ముల స్వరూపరెడ్డి, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు