కౌన్సిలర్ పదవికి రాజీనామా

3 Aug, 2016 15:56 IST|Sakshi

ప్రొద్దుటూరులోని 20 వ వార్డు టీడీపీ కౌన్సిలర్ ఆశం రఘరామి రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.తన రాజీనామా లేఖను మున్సిపల్ కమిషనర్ వెంకటశివారెడ్డికి అందజేశారు. ప్రస్తుతం ఉన్న చైర్మన్ ఉండేల గురివిరెడ్డి తన పదవీకాలం ముగిసినా రాజీనామా చేయకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయంలో మున్సిపల్ చైర్మన్ పదవి ఉండేల గురివిరెడ్డికి2 సంవత్సరాలు, ఆశం రఘరామిరెడ్డికి 3 సంవత్సరాలు పంచుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండు సంవత్సరాలు గడిచి నెలరోజులు అవుతున్నా గురివిరెడ్డి రాజీనామా చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

 

మరిన్ని వార్తలు