రిషితేశ్వరి ఆత్మహత్యపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి

31 Jul, 2015 13:40 IST|Sakshi

విశాఖపట్నం : విద్యార్థి రిషితేశ్వరి ఆత్మహత్యపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం విశాఖపట్నంలో రఘువీరారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... రిషితేశ్వరి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాక్సైట్ కేటాయింపులపై జోక్యం చేసుకుని ఎటువంటి అవకతవకలు లేకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు