'2019 తో టీడీపీ ఆయుష్షు ఖతం'

30 May, 2016 19:23 IST|Sakshi

విజయవాడ: 2019 తో తెలుగుదేశం పార్టీ ఆయుష్షు ముగిసిపోతుందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. 2050 వరకు తానే సీఎం అంటూ చంద్రబాబు నాయుడు కలలు కంటున్నారని విమర్శించారు. సోమవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.

రెండేళ్లలో టీడీపీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. దీనిపై జూన్లో సీఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఓటుకు కోట్లు కేసుకు భయపడే చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని రఘువీరా విమర్శించారు.

మరిన్ని వార్తలు