వరంగల్‌ బిట్స్ లో ర్యాగింగ్ కలకలం

28 Jan, 2016 09:41 IST|Sakshi
వరంగల్‌ బిట్స్ లో ర్యాగింగ్ కలకలం

వరంగల్: వరంగల్ జిల్లా న ర్సంపేటలో ర్యాగింగ్ కలకలం రేగింది. స్థానిక బిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సినియర్ విద్యార్థులు దాడి చేయడంతో ఓ జూనియర్ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతిన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

బిట్స్‌లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆదిత్య అనే విద్యార్థిపై కొందరు సీనియర్ విద్యార్థులు బుధవారం రాత్రి దాడి చేశారు. ఈ దాడిలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు